వట్పల్లి/సంగారెడ్డి : వట్పల్లి నుంచి దుద్యాల వరకు రూ.కోటి 58 లక్షలతో 3.2 కిలో మీటర్లు వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను బుధవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై ప్రతేక దృష్టి పెట్టిందన్నారు. అన్ని మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించిందన్నారు. రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్