సంగారెడ్డి : సబ్సిడీపై అందజేసే పచ్చి రొట్ట (జీలుగు, జనుము) ఎరువులను రైతులు వినియోగించుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. జోగిపేటలో పచ్చి రొట్ట ఎరువులను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..వీటి వాడకం వల్ల భూమిలో సారం పెరిరుగుతుందని, భూసారం పెరగడం వల్ల రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే జీలుగ వాడటం వల్ల భూమిలో చౌడు పోతుందని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందాలన్నారు.
వర్షాలు పడక ముందే కావాల్సిన ఇతర ఎరువులను రైతులకు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రైతులు విడతలవారీగా వచ్చి ఎరువులను తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఎరువులు అందించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేష్, సహాయ వ్యవసాయ సంచలకురాలు అరుణ, అత్మ చైర్మన్ యాదగిరి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సారిక, ఏఈఓలు శ్రీనివాస్, శ్రీకర్ అనిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు