యాదాద్రిభువనగిరి : అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి,ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నారని తెలిపారు.
గౌడ కులస్తుల కోసం సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తాటి, ఈత మొక్కల పెంపకంతో గౌడన్నలకు ఉపాధి లభిస్తుందన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం