నల్లగొండ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుక్రవారం పల్లె నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటలకు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గ్రామస్తులు, అధికారులతో కలిసి గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. మురికి కాలువలు, సీసీ రోడ్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి ఆరాతీశారు. పర్యటనలో డివిజన్ స్థాయి అధికారులు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ నాగార్జునరెడ్డి, మండల విద్యాధికారి నరసింహ్మ, గ్రామ సర్పంచ్ ఉపేంద్ర చారి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాత్రి పల్లె నిద్ర అనంతరం రేపు ఉదయం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టనున్నారు.