హైదరాబాద్: బీజేపీ భారతీయ జనకంటక పార్టీగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నదని చెప్పారు. రఘునందన్రావు మేధావిలా ఫీలవుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా బిలియన్ మార్చ్ చేయాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ మాట తప్పాడని విమర్శించారు.
సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలు నిర్మిస్తున్నారని తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు మాటలు చెప్పడం మానుకోవాలని సూచించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.200 పింఛన్ ఇస్తే, తెలంగాణలో రూ.2 వేలు ఇస్తున్నామని చెప్పారు.