హైదరాబాద్: దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫికెట్ల ఎంపీ అని దుయ్యబట్టారు. శాసనసభ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు రాసిచ్చిన ఎంపీ అరవింద్ మాట తప్పాడని, ఆ బాండ్ పేపర్ కూడా నకిలీగా మారిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు దోచుకున్న దొంగలను విదేశాలకు దాటించిందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ పాలనను దేశమంతా ప్రశంసిస్తోందని జీవిన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారని వెల్లడించారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్గా స్కీంను తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని ఎద్దేవా చేశారు.