న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలింగ్కు 72 గంటల ముందు బైక్ ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ నిబంధన రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. అయితే పోలింగ్కు రెండు రోజుల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయం వరకు కొద్ది మంది బైక్లపై తిరుగుతూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈసీ తెలిపింది. ఈ కారణంగానే తాజాగా బైక్ ర్యాలీలపై పోలింగ్కు మూడు రోజుల ముందే నిషేధం విధించింది.