జయశంకర్ భూపాలపల్లి : కరోనా సోకిందని ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ దవాఖానాల్లో కొవిడ్ బాధితులను ఆయన పారమర్శించారు. వారికి అందుతున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ మానసికంగా ధైర్యంగా ఉంటే కరోనాను జయించ వచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం