వరంగల్ రూరల్ : రైతుల మేలు కోసమే రైతులు వేదికలు నిర్మిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతు వేదికలతో సాగులో వచ్చే సాధక బాధలను ఇందులో చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని దామెర మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని 14 గ్రామాలకు చెందిన 129 కుటుంబాలకు ప్రభుత్వం అందించిన కొత్త రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం