హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం,రూ.10 లక్షలతో మహిళ సంఘాల భవనం, రూ.5లక్షలతో పేరుకు కమ్యూనిటీ హాల్, రూ.15లక్షలతో గూడూరు నుంచి కేశవపూర్ రోడ్డు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు.
అనంతరం 91 మహిళాసంఘాలకు గాను రూ.49 లక్షల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను గ్రూప్ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర రావు,మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.