హైదరాబాద్ : తెలంగాణలో ఈ యాసంగిలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. యాసంగిలో 12 లక్షల మంది రైతుల నుంచి 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయని వెల్లడించారు. గ్రామాల్లో ఇంకా 2 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి వనరులు పెరిగినందున వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.