సీఎం కేసీఆర్ సంతాపం
డిచ్పల్లి, జూలై 7: నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి (54) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. గత ఐదేండ్లుగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. శోభారాణి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. బాజిరెడ్డి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించారు. శోభారాణి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. శోభారాణి అంత్యక్రియలు గురువారం ఉదయం 8 గంటలకు నిజామాబాద్లో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.