వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం ఎస్వీఎస్ కాలేజీ వద్ద రూ. 45 లక్షల జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు విలీన గ్రామాలతో కూడి ఉన్నాయని, విలీన గ్రామాలలో పట్టణ వాతావరణం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.