హుజురాబాద్ : జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన పంచాయితీ రాజ్,రోడ్లు భవనాల అధికారులతో మాట్లాడి వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, జిల్లా రైతు బంధు మెంబర్ లింగరావు, మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ, మాచనపల్లి గ్రామ సర్పంచ్ కల్పనతిరుపతి, ఎంపీటీసీ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.