మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ ఆపత్కాలంలో తన వంతు సాయం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. కొందరికి డబ్బు కూడా దానం చేసింది. దీనిని కొందరు దుర్వినియోగం చేయడంతో ఈ సారి ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందిస్తానని పేర్కొంది.
మంచి చేయబోతే చెడు ఎదురైనట్టు కొందరు రేణూ దేశాయ్కు బెదిరింపు మెసేజ్లు చేస్తున్నారట. ఆర్ధిక సాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అని కొందరు అంటుంటే, మరి కొందరు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారట. ఈ విషయంపై సీరియస్ అయిన రేణూ దేశాయ్ ఇలాంటి మెసేజ్లు చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది. తను ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని మరోమారు స్పష్టం చేసింది.