కొత్తూరు, మే21:కొత్తూరు మున్సిపాలిటీకి కొత్త అందం తీసుకురావాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్యాదవ్, వైస్చైర్మన్ డోలి రవీం దర్కు సూచించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్, చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, వైస్చైర్మన్ డోలి రవీందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం స్థల సేకరణ విషయంలో చైర్ పర్సన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. స్థలాలు చూపిస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధు లు కొరత లేకుండా చూస్తామని ఎమ్మె ల్యే హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సీ చంద్రకళ రాజేందర్గౌడ్, వి. హేమాదేవేందర్, కొస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్, అనితాశ్రీనివాస్ గౌడ్, జయ మ్మ జనార్దనచారి, నరసింహా గౌడ్, బ్యాగరి ప్రసన్న లత యాదయ్య, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు యాదగిరి, చేగూర్ సింగిల్విండో చైర్మన్ గొల్లపల్లి అశోక్, టీఆర్ఎస్ నాయకులు రవినాయక్, కార్తీక్రెడ్డి, కటికె రాజు, క్రాంతిరెడ్డి, మాసుల రామకృష్ణ, మేకల రాఘ వేందర్యాదవ్, బండి శ్రావణ్ పాల్గొన్నారు.