అమీర్పేట్, జూన్ 21 : యోగాను జీవితంలో భాగంగా చేసుకున్నప్పుడే ప్రజలు పూర్తి ఆరోగ్య జీవితాన్ని గడపగలరని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్ కేఎల్ఎన్ పార్కులో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన యోగా సాధన హాలును కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. యోగా హాలులో ఫ్యాన్లు, విద్యుత్ దీపాల వంటి ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని, అక్కడే ఉన్న జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణను ఆదేశించారు. కార్యక్రమంలో యోగా చార్యులు పి.కృష్ణ, కేఎల్ఎన్ పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షాబాద్ శ్రీనివాస్రావు, సనత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రాజేశ్ ముదిరాజ్, ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
యోగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను సోమవారం దవాఖాన ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పతాంజలి మహర్షి అభ్యాసం, వైరాగ్యం అనే పద్ధతులను యోగాలో ప్రస్తావించారన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, సీఈఓ ప్రభాకర్రావు, సీఓఓ రవికుమార్, కల్పన, డాక్టర్ సుమతి, యోగా గురువులు ఉదయ్కుమార్, భరత్కుమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో యోగాసనాలు వేశారు. విద్యార్థులు యోగా నమస్కార్, హఠ యోగా, నాద యోగా, నాడీశుద్ధి, ప్రాణాయామ, తదితర ఆసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను చైర్మన్ మురళీ ముకుంద్ ప్రశంసించారు.
అంతర్జాతీయ యోగా దినో త్సవాన్ని పురస్కరించుకుని సోమవారం యూ సుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్స్ యోగాసనాలు, మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. మోతీనగర్లోని డాన్బాస్కో స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ అధికారులు పి.ప్రభాకర్, ఉమేశ్ సింగ్ పాల్గొని విద్యార్థులతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.