న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చట్ట నిబంధనలపై రైతులతో సంప్రదింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రైతుల నిరసనలతో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికి 11 సార్లు చర్చలు జరిగాయి.
సాగు చట్టాల రద్దుపై మినహా చట్ట నిబంధనలపై అర్ధరాత్రి అయినా రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దమని మంత్రి తోమర్ పేర్కొన్నారు. రైతులతో ప్రభుత్వ సంప్రదింపులను తాను స్వాగతిస్తానని కేంద్ర మంత్రి తోమర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.