ఎనిమిదేండ్ల తర్వాత ఇంటికి చేరిన మహిళ
సుబేదారి, సెప్టెంబర్ 12: ఆ తల్లి మానసిక వ్యాధితో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎనిమిదేండ్లయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు వెతకని చోటూ లేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడం తో జ్ఞాపకాలతోనే బతుకున్నారు. ఎట్టకేలకు వాట్సాప్ ద్వారా ఆమె ఇంటికి చేరగా కుటుంబసభ్యుల్లో సంతోషం మిన్నంటింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అమృతమ్మ మతిస్థిమితం కోల్పోయి ఇంటినుం చి వెళ్లిపోయింది. ఖమ్మంలో రైలెక్కి పశ్చిమబెంగాల్కు వె ళ్లింది. ముషీరాబాద్ జిల్లా బెల్డంగలోని స్వధార్హోంలో ఇన్నాళ్లు ఆశ్రయం పొందింది. ఇటీవల తన స్వస్థలం మహబూబాబాద్ అని నిర్వాహకులకు చెప్పడంతో వారు ఆమె ఫొటోలను వరంగల్ పోలీసులకు పంపారు. సీపీ తరుణ్జోషి సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేశారు. అమృతమ్మ భర్త రాంరెడ్డి గుర్తుపట్టి సీపీని సంప్రదించగా అమృతమ్మను తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.