మహబూబాబాద్ : కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం లెనిన్ నగర్ వడ్డెర కాలనీ లలో నివాసముంటున్న వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వస్తున్నారా? ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
కరోనా పాజిటివ్ వ్యక్తులు బయటకు రాకుండా వార్డ్ కౌన్సిలర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఇబ్బందులు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు డాక్టర్ల వద్ద, వైద్య సిబ్బంది వద్ద లక్షణాలు వెల్లడించడం లో ఏమాత్రం సిగ్గు పడొద్దన్నారు. నిర్భయంగా ఉండాలని, ఆహారం తీసుకుంటూ మందులు సక్రమంగా వాడితే నయమవుతుందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట కౌన్సిలర్ మార్నేని వెంకన్న ఉప వైద్యాధికారి అంబరీష, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి రాజేష్, తాసిల్దార్ రంజిత్, పరికిపండ్ల అశోక్, టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి