కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం 500 మంది లబ్ధిదారులకు గొర్రె యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని మంత్రులు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి.
ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరి పథకాలు లేవన్నారు. బీజేపీ నాయకులకు దమ్మంటే గొర్రెల పంపకం వంటి ఒక్క పథకాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. చేతనైతే సద్విమర్శలు చేయాలని, వ్యక్తి గత దూషణలు సరికావని హితవు పలికారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం