ములుగు : జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు ఆయాలను దర్శించారు. ముందుగా గట్టమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిత గ్రాండ్ గట్టమ్మ హోటల్ను ప్రారంభించారు.
ఇక్కడ నుంచి వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయానికి చేరుకొని రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప దేవాలయం శిల్పకళ నైపుణ్యాన్ని గైడ్ ద్వారా మంత్రులు తెలుసుకున్నారు.
అలాగే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ, ప్రజా మౌలిక సదుపాయాలను కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. వారి వెంట టూరిజం
రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు.