హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఉచితంగా రోగ నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కరోనా సహా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసింది. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందనున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పంపే నమూనాలకు పరీక్షలు జరిపేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు.
నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, గద్వాల, సంగారెడ్డి, మెదక్, జనగామ, ములుగు, మహబూబాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని నేడు ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభింస్తారు.