భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని గుండాల మండలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గుండాల మండలంలో రూ. 4.21 కోట్లతో మల్లన్న వాగుపై నిర్మించిన హై-లెవెల్ బ్రిడ్జిను ప్రారంభించారు. గుండాల నుండి పస్రా వెళ్లే రహదారిపై ఈ బ్రిడ్జిను నిర్మించారు. నర్సాపురం గ్రామంలో రూ.2.17 కోట్లతో మల్లన్న వాగు మీద నిర్మించిన చెక్ డ్యాం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు, ఎంపీ మాలోత్ కవిత , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.