హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, డోర్నకల్ నియోజక వర్గాల నేతలు హాజరయ్యారు.
ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్వి శతాబ్ది ఉత్సవాల ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.