కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో భారీగా నాటుబాంబులు పట్టుబడుతుండటం కలకలం రేపుతున్నది. మంగళవారం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని బంగర్ ప్రాంతంలో సుమారు 200 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులు ఎవరు తయారు చేశారు?. ఇక్కడి ఎలా వచ్చాయన్న దానిపై కాశీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.