కాజీపేట, మే 14 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ముస్లింలు శుక్రవారం రంజాన్ వేడుకలను ఇండ్లలోనే జరుపుకున్నారు. దర్గాకాజీపేటలోని బియాబాని దర్గా ప్రాంగణం, జామా మజీద్, డిజీల్ కాలనీలోని మదీన మజీద్లో పరిమిత సంఖ్యలో మత పెద్దలు మాత్రమే ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు రంజాన్ పండుగ సందర్భంగా తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి ఇండ్లలోనే ప్రార్థ్ధనలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బియాబాని దర్గాకు పలువురు భక్తులు వచ్చి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు కరోనా వైరస్ మందులను పంపిణీ చేశారు. దర్గాలో కొందరు ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.