నిర్మల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుగ్..పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమలను ప్రతిష్టించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో తీవ్ర జల కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పర్యావరణహితం కొరకు రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు. క్లిమోమ్ నిర్వాహకురాలు అల్లోల దివ్యారెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో