సోన్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను గురువారం పంపిణీ చేసినట్లు సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహిద్దీన్ తెలిపారు. సోన్ గ్రామానికి చెందిన దాసరి రాజేశ్వర్ కుటుంబానికి రూ.24వేలు, కడ్తాల్ గ్రామానికి చెందిన శ్రీరాం కుటుంబానికి రూ. 17,500, సాకెర గ్రామానికి చెందిన శ్రీనివాస్కు రూ. 41,500, డి.రాజవ్వకు రూ. 14,500చొప్పున చెక్కులను అందజేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. తమకు ఆర్థిక సహాయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ దాసు, కడ్తాల్ ఉప సర్పంచ్ పుట్టి సాయేందర్ తదితరులు పాల్గొన్నారు.