జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.
కొవిడ్ వ్యాప్తి జరుగకుండా ప్రజలు సహకరించాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు.
జనగామ ఏరియా దవాఖానలో పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి