హైదరాబాద్, జూన్24(నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. నాణ్యతలో రాజీపడే ప్రసక్తి లేదని, సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈ ఈ శశిధర్, వర్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆరిటెక్ట్ ఆసార్ పొన్ని పాల్గొన్నారు.