హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): వరంగల్లో నిర్మించనున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని విభాగాల సమూహంతో కూడిన దవాఖానగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన గురువారం హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్ తదితర అంశాలపై ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆరిటెక్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన దవాఖానగా ఉండేలా ప్లాన్లు తయారుచేయించాలని ఆరిటెక్ట్లకు సూచించారు. ఈ నెల 20వ తేదీలోగా డిజైన్స్, ఎలివేషన్లతో కూడిన ప్లాన్స్ సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, టీఎస్ఎంఎస్ఐడీసీ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.