హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం మంత్రిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్ను ఘనంగా సత్కరించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యావ్యవస్థ ప్రతిష్ఠతకు కృషి చేయాలని మంత్రి అన్నారు.