హైదరాబాద్ : ఆర్అండ్బీ, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల్లోని ఖాళీలను గుర్తించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ఆయా శాఖల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలని సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఆర్అండ్బీ, న్యాక్, హౌసింగ్, అసెంబ్లీ శాఖల్లో ఖాళీలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు శాఖకు కేటాయించిన పోస్టుల్లో ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. త్వరలోనే ఖాళీల పూర్తి సమాచారాన్ని సీఎం కేసీఆర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ అండ్ హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ(అడ్మిన్) సతీష్, న్యాక్ డీజీ భిక్షపతి, హౌసింగ్ ఎస్ఈలు చైతన్య, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, అసెంబ్లీ ఉప కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.