నల్లగొండ : తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఎం సీనియర్ నేత బైరు మల్లయ్యగౌడ్ విగ్రహన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో మల్లయ్యగౌడ్ ప్రథమ వర్ధతి సందర్భంగా మంత్రి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లయ్య గౌడ్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడాని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం