హైదరాబాద్ : ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెలూన్లను ఎగుర వేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని స్మరించుకున్నారు. దేశానికి లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
వన మహోత్సవం, ఫ్రీడమ్ రన్, జాతీయ రక్షా బంధన్, ఫైర్ వర్క్స్, హాస్పిటల్స్లో పండ్ల పంపిణీ , రంగోళి ఇలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి20లక్షల మంతికి జాతీయ పతాకాలు పంపిణీ చేస్తుందన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రికి జీహెచ్ఎంసీ కమిషన్ మంత్రికి జాతీయ జెండాను అందించారు. అనంతరం ఐ మ్యాక్స్ థియేటర్లో గాంధీ చిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయన వెంట ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.