వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి టౌన్, ఏప్రిల్ 5 : అధునాతన ఈ-లైబ్రరీని అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 50లక్షలతో ఆధునిక గ్రంథాలయా న్ని వీలైనంత త్వరలో అందుబాటులోకి తెస్తామన్నా రు. మొదటి దశగా రూ.25లక్షల చెక్కును గ్రంథాల య సంస్థ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మ య్య, మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ గట్టుయాదవ్, వాకిటీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రెడ్డి, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ మహేశ్వర్రెడ్డి, పరంజ్యోతి, జాత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.