హైదరాబాద్ : అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సందర్శించారు. బాలికలతో కలిసి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భోజనం చేశారు. బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఎదైనా అవరముంటే తక్షణమే తెలియజేయాలన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఉన్నారు.