ఇద్దరు యువకులు అరెస్ట్
50 కిలోల గంజాయి స్వాధీనం
కష్టాల నుంచి బయటపడేందుకు.. గంజాయి స్మగ్లింగ్ను ఎంచుకున్నారు..ఈ క్రమంలో వైజాగ్ నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నిస్తూ ఇద్దరు యువకులు సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు.. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మహ్మద్ ఖదీర్ ఓల్డ్మలక్పేట పాపయ్యబస్తీలో నివాసముంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. తన ఉద్యోగంతో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో.. ఆ కష్టాల నుంచి బయటపడడానికి మిర్యాలగూడకు చెందిన బంధువు మహ్మద్ అజీజ్ను సంప్రదించాడు.
ఇద్దరం ఆర్థిక పరమైన కష్టాల నుంచి బయటపడాలంటే విశాఖపట్టణంలో తక్కువ ధరకు గంజా యి కొనుగోలు చేసి… హైదరాబాద్, మహారాష్ట్రలో ఎక్కువగా ధరకు విక్రయించడం వల్ల బాగా డబ్బు వస్తుందని.. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతాయని భావించారు.. ఇలా ఇద్దరు కలిసి విశాఖకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి.. నగరానికి తీసుకొచ్చారు. ఆ గంజాయిని చాంద్రాయణగుట్టలో స్నేహితుడు మహ్మద్ ముజీబ్ ఇంట్లో దాచిపెట్టారు.
దీనిపై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం.. ఫలక్నుమా పోలీసులతో కలిసి ఆ ఇంటిపై దాడి చేసింది. ఈ దాడు ల్లో 50 కిలోల గంజాయి, గంజాయి తీసుకొచ్చిన కారు, రెండు సెల్ఫోన్లు లభించాయి. మహ్మద్ ఖదీర్, మహ్మద్ ముజీబ్లను అరెస్ట్ చేసి, పట్టుబడ్డ సొమ్మును తదుపరి విచారణ నిమిత్తం ఫలకునుమా పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అజీజ్ పరారీలో ఉన్నాడు.