అమరావతి : ఆంధప్రదేశ్లోని విజయనగరంలో జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు కోసం కన్నతల్లినే కడతేర్చింది ఓ కుమార్తె. భోగాపురం మండలం సవర్లవల్లి గ్రామంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి, రూపశ్రీ తల్లీకుమార్తెలు. రూపశ్రీ ప్రియుడు వరుణ్సాయితో తిరుగుతుండటంతో తల్లి అడ్డు చెప్పింది. దీంతో ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి రూపశ్రీ ఆమె గొంతును నులిమింది. అపస్మారక స్థితికి చేరడంతో చనిపోయినట్లు భావించి ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది.
తండ్రిసాయంతో తల్లిని చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించింది. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతిపై వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రూపశ్రీని తమదైన శైలిలో విచారించగా వ్యవహరం గుట్టు రట్టయ్యింది. నిందితురాలు రూపశ్రీతోపాటు ఆమె ప్రియుడు వరుణ్సాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.