బుల్లితెరపై స్టార్ హీరోల సందడి పెరగుతూ పోతుంది. ఇప్పటికే నాగార్జున, నాని, చిరంజీవి, రానా వంటి స్టార్స్ బుల్లితెరపై సందడి చేయగా, ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్దమయ్యారు. బిగ్ బాస్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులని ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో స్టార్ మా ఛానల్లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది. దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకోనున్నాయో ప్రోమోలను చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న మాటలు షో పట్ల ఉన్న ఆసక్తికి రెక్కలు కట్టాయి. ఇక వెండితెర విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.