మహబూబ్నగర్ : మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించారు. ఈ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్ టెస్టును ఉచితంగా చేయనున్నారు. ఈ ల్యాబ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. పేద ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.