సంక్షే మం, అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్న మానవ హక్కుల కమిషన్ ప్రచార సభ్యుడు, ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు అన్నారు. బర్కత్పులోని కార్యాలయంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్తో కలిసి రామదాసప్ప నాయుడు మంగళవారం మాట్లాడారు. సీపీ అంజనీ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్లను నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా(న్యూఢిల్లీ), ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఇస్తున్న నెల్సన్ మండేలా అవార్డు 2021 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్ పర్యవేక్షణలో ఈ అవార్డులకు అంజనీకుమార్, ప్రవీణ్ కుమార్లను ఎంపిక చేసినట్లు వారు వెల్లడించారు. ఈ అవార్డులను నవంబర్ 14న ఢిల్లీలో నిర్వహించే జాతీయ సహకార వారోత్సవాల్లో వారికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.