హైదరాబాద్ : ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని గ్రీన్ బిజినెస్ సెంటర్లో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ యోగ చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.