మహబూబ్నగర్: ఓలింపిక్ క్రీడలపై ప్రజలకు, క్రీడాకారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోక్యో ఒలింపిక్స్- 2020 సెల్ఫీ పాయింట్ను క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నెల 31 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడల పై అవగాహన కోసం అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి