న్యూఢిల్లీ: 45 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగాలు కోవిడ్ టీకా తీసుకోవాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను అభ్యర్థించింది. కోవిడ్19 ఉదృతిని అడ్డుకోవాలంటే సమవర్థవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగాలని కేంద్రం అభిప్రాయపడింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కూడా కేంద్రం తన సూచనల్లో స్పష్టం చేసింది. మాస్క్లు ధరించడం, చేతుల్ని శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టాన్స్ పాటించాలని కోరింది. సిబ్బంది వ్యవహారాల శాఖ ఇవాళ తన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 45 ఏళ్లు దాటిన వారు కోవిడ్ టీకాను తీసుకోవచ్చు అని, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల ఉద్యోగులు టీకా తీసుకోవాలని ఆ దేశాల్లో పేర్కొన్నారు.