హైదరాబాద్ : మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిపై ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఆధునిక అండర్ గ్రౌండ్ వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబుబ్ నగర్ పట్టణంలో సుమారు రూ. 500 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్వవస్థను రూపోందించటానికి ప్రతిపాదనలు సిద్దం చేయాటానికి కన్సల్టెంట్ల నియామాకం కోసం టెండర్ పిలువాలని మంత్రి అధికారులను అదేశించారు.
ఐదు ఎస్టీపీల ద్వారా మురుగు నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మహబుబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువును శుద్దిచేసేందుకు మురుగు నీటిని దారి మళ్లించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలన్నారు. పట్టణానికి అనుబందంగా వస్తున్న ప్రతిపాదిత రెండు జాతీయ రహదారులను అనుసందానిస్తూ ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుపై మంత్రి ఈ సమీక్షలో చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలతో నిర్వహించే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో చర్చించే అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై క్షేత్రస్థాయి పర్యటన చేసి తదుపరి నిర్ణయాలను మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నమోదు చేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డీటీసీపీ డైరెక్టర్ విద్యాదర్ రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, మహబుబ్నగర్ కలెక్టర్ వెంకటరావు, వెంకటేశ్వర్లు ఎస్ఈ(పబ్లిక్ హెల్త్), మహబుబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ భాస్కర్ రెడ్డి, కన్సల్టెంట్ సుభాన్, ఆర్వీ అసోసియట్స్ ఇంజినీర్లు, సంబందిత శాఖల అధికారులు పాల్గోన్నారు.