మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్ : ప్రతి ఒక్కరూ కష్టకాలంలో సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వార్డులో పనిచేస్తున్న కార్మికులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా సమయంలో కరోనా వార్డులో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లు, మహిళా కార్మికులు, వార్డు బాయ్స్ సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి సాయం చేయాలనే సంకల్పంతో రైస్ మిల్లర్లను కోరిన వెంటనే సహాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
120 మంది సిబ్బందికి 25కిలోల బియ్యం, కిలో కందిపప్పు, గోధుమపిండి, మంచినూనె తదితర సరుకులను అందించామన్నారు. మరో 100మందికి నిత్యావసర సరుకులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రైస్ మిల్లర్స్ సంఘం కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పాల్కొండ 9వ వార్డులో రూ.3.80లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.