మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులను మహబూబ్నగర్ పట్టణానికి చెందిన 1480 మంది లబ్ధిదారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అర్హులందరికి రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కేసి.నర్సింలు, డిసిసిబి వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా