హైదరాబాద్: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ క్రీడాకారులను క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానాలో ఈ నెల సెప్టెంబర్ 10 నుంచి 13 వ తేదీ వరకు బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, హర్యానా రాష్ట్రంలోని సోనిపత్ గ్రామంలో ఎస్ఎం బాక్సింగ్ క్లబ్ వేదికగా 4వ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ క్రీడలు జరిగాయి.
2021 లో అండర్ 12 విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్ మెన్ అండ్ వుమన్ వెయిట్ కేటగిరీలలో తెలంగాణ జట్టు నుంచి 64 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 22 గోల్డ్ మెడల్స్ 24 సిల్వర్ మెడల్స్ 16 కాంస్యం పథకాలు గెలుచుకున్నారు. అంతేగాక రన్నరప్ కప్ ను కూడా గెలుచుకోవడం విశేషం. ఓవరాల్ టీం చాంపియన్షిప్లో 2వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన క్రీడాకారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, మహేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
పథకాలు సాధించిన క్రీడాకారులు ఈ రోజు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలోని చైర్మన్ చాంబర్ లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డిని కలిశారు. కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, తెలంగాణ బాక్సింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీఎస్ రఘు, వైస్ ప్రెసిడెంట్ మారుతి, జనరల్ సెక్రెటరీ కె.రఘువీర్, ఆర్గనైసింగ్ సెక్రెటరీ భవాని ప్రసాద్, ట్రెజరర్ భండారి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఆవునూరి మహేశ్, కోచ్ షేక్ ఇజాజ్ అహ్మద్, మహర్షి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.